హైదరాబాద్ : మధ్యప్రదేశ్లోని షాదోల్ జిల్లాలో ఓ ఎద్దు వ్యక్తిపై దాడి చేసింది. ఖాళీ రోడ్డుపై నడుచుకుని వెళ్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన ఎద్దు అతడిని కిందపడేసి మరీ కొమ్ములతో కుమ్మేసింది. ఇంతలో అటుగా వస్తున్న ఓ వ్యక్తి సైకిల్ను అడ్డుపెట్టి అతడిని రక్షించే ప్రయత్నించాడు. కాసేపు నిలకడ ఉన్న మళ్లీ అతడిని కుమ్మేసింది. అతడినే ఏదో పగబట్టినట్టుగా ఆ వ్యక్తిని పొడుస్తూనే ఉంది. కొద్ది నిమిషాల తర్వాత స్థానికులు స్పందించి ఆ వ్యక్తిని రక్షించారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm