ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వ్యాప్తంగా తమ డీలర్షిప్లను తెరిచిన వెస్పా మరియు ఏప్రిలియా
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి, విశాఖపట్నం, భీమవరం, రాజమండ్రి, విజయనగరం, నెల్లూరు మరియు తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్, మహబూబ్నగర్ లలో వెస్పా మరియు ఏప్రిలియా డీలర్షిప్లు అన్ని టచ్ పాయింట్ల వద్ద అత్యున్నత జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి
- అన్ని డీలర్షిప్ల వద్ద భౌతిక దూర ప్రమాణాలు అనుసరించడంతో పాటుగా ఆరోగ్య, పారిశుద్ధ్య మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నాయి.
పియాజ్జియో ఇండియా యొక్క వెస్పా మరియు ఏప్రిలియా డీలర్షిప్లు ఇప్పుడు తిరుపతి, విశాఖపట్నం, భీమవరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విజయనగరం మరియు నెల్లూరులతో పాటుగా హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్లలోని షోరూమ్లలో తమ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి సిద్ధమయ్యాయి. గత కొద్ది రోజులుగా సంబంధిత స్థానిక అధికారుల నుంచి అవసరమైన అనుమతులన్నీ అందుకున్న తరువాత ఈ డీలర్షిప్లను దశలవారీగా తెరుస్తున్నారు. రెండు రాష్ట్రాలలోని 20 డీలర్షిప్ల వద్ద అన్ని టచ్ పాయింట్లలోనూ అవసరమైన ఆరోగ్య, భద్రత, సంరక్షణ ప్రమాణాలను తీసుకున్న తరువాత పాక్షికంగా కార్యకలాపాలను ప్రారంభించడం జరిగింది. షోరూమ్లు మరియు వర్క్షాప్లను కంపెనీ సూచించిన మార్గదర్శకాలకనుగుణంగా పూర్తిగా శానిటెజ్ చేసిన తరువాతనే తెరువడం జరుగుతుంది. తద్వారా ఉద్యోగులు, వినియోగదారులకు గరిష్ట భద్రతకు భరోసాను అందిస్తుంది. ఈ మార్గదర్శకాలు, సూచనలను ఆరోగ్య సేతు యాప్ వినియోగాన్ని సైతం అనుసరించేలా అభివృద్ధి చేశారు.
ఈ డీలర్షిప్లను సురక్షిత వాతావరణంలో నిర్వహిస్తున్నారు మరియు భౌతిక దూర మార్గదర్శకాలను బృందాలు అనుసరిస్తున్నాయి. వీటితో పాటుగా కాంటాక్ట్లెస్ గ్రీటింగ్ బీ ప్రొటెక్టివ్ గేర్ ధారణ, వినియోగదారుల కు అమ్మకాలు మరియు సేవల అవసరాలను పరిష్కరించే క్రమంలో హ్యాండ్ శానిటైజర్లను వినియోగించడం వంటివి సైతం చేస్తున్నారు. డీలర్షిప్ల వద్ద వేచి ఉండకుండా ఉండేందుకు వినియోగదారులు డీలర్షిప్లకు కాల్ చేసి సర్వీస్ అపాయింట్మెంట్లను ముందుగా బుక్ చేసుకోవచ్చు. దశలవారీగా తమ సేల్స్ ఛానెల్స్ను తెరువడంతో పాటుగా పియాజ్జియో ఇండియా తమ తయారీ కార్యక్రమాలను సైతం బారామతి ప్లాంట్లో ప్రారంభించింది. తద్వారా ప్రతిష్టాత్మక వెస్పా, స్పోర్టీ ఏప్రిలియా స్కూటర్ల సరఫరాను పునరుద్ధరిస్తుంది.
ఏపీ, తెలంగాణాలలో తమ కార్యకలాపాలు పునః ప్రారంభించడం గురించి శ్రీ డియాగో గ్రాఫీ, ఛైర్మన్ అండ్ ఎండీ, పియాజ్జియో ఇండియా మాట్లాడుతూ ''నూతన వాస్తవికత ద్వారా అవకాశాలను అన్వేషించడంలో మా డీలర్లతో కలిసి మేము పనిచేస్తున్నాము మరియు మా డీలర్షిప్లను తెరువడమనేది ఆ దిశగా ఓ కీలకమైన ముందడుగు. మా వినియోగదారుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని,మేము గతంలోనే మా ఒరిజినల్ ఎక్విప్మెంట్ వారెంటీని మరియు లాక్డౌన్ కాలంలో ముగిసే ఉచిత వారెంటీలను పొడిగిస్తున్నట్లుగా వెల్లడించాం. మా డీలర్షిప్ల వద్ద అన్ని వాహనాల విక్రయాలు, సేవలకు సంబంధించిన సందేహాలను తీర్చడానికి సిద్ధమయ్యారు. నూతన వాహన కొనుగోలు మరియు సేవలను పొందడంలో ఎలాంటి క్లిష్టతనూ మా వినియోగదారులు పొందరనే భరోసాను కల్పించాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. మా ఉత్పత్తులు మరియు బ్రాండ్లు స్వతంత్య్ర జీవనశైలిని అనుసరించేందుకు తోడ్పడటంతో పాటుగా ఈ కష్టకాలంలో జీవితాన్ని సాఫీగా తిరిగి ప్రారంభించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే వారి లక్ష్యం సాకారం కావడంలోనూ తోడ్పడుతుంది''అని అన్నారు. తిరుపతి, విశాఖపట్నం, భీమవరం, రాజమండ్రి, విజయనగరం, నెల్లూరు, హైదరాబాద్, మహబూబ్నగర్ల లోని అన్ని డీలర్షిప్ల వద్ద వెస్పా మరియు ఏప్రిలియా స్కూటర్ల అమ్మకాలు మరియు సేవలపై ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులు పొందవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 30,2020 04:39PM