డెహ్రాడూన్: ఉత్తరఖండ్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ రోజు మరో 11 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 727కు చేరింది. తాజాగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో డెహ్రడూన్లో 7 మందికి కరోనా నిర్ధారణ కాగా టెహ్రీ జిల్లాలో మరో నలుగురికి కరోనా సోకినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొన్నారు. డెహ్రాడూన్లో నమోదైన 7 కొత్త కరోనా కేసులు నిరంజన్పూర్ సబ్జీ మండీ అనే మార్కెట్కు సంబందించిన కేసులుగా తెలిసింది. టెహ్రీలో కొత్తగా వచ్చిన నాలుగు కరోనా కేసులు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో నమోదైనట్లు బులిటెన్లో వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm