లోకమణి అమ్మకు ప్రశంసాపత్రం అందజేసిన హెచ్సీసీబీ
హైదరాబాద్: లాక్డౌన్ కొనసాగుతున్న వేళ, దేశవ్యాప్తంగా పోలీసు అధికారులు మండుతున్న ఎండలలో సైతం అత్యంత కఠినంగా లాక్డౌన్ నిబంధనలు అనుసరించేలా కృషిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఓ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా (ఎఫ్బీఓ ప్రాంతం) తునిలోని స్ధానిక పాఠశాలలో కేర్టేకర్గా పనిచేస్తున్న లోకమణి అమ్మ, తన జీతం 3500 రూపాయలను అందుకుని ఇంటికి తిరిగి వస్తున్న వేళ ఎండలో పోలీసులు విధులను నిర్వహించడం గమనించారు.
ఆమె నిస్వార్థంగా 2.25 లీటర్ల పార్టీ ప్యాక్ థమ్సప్ మరియు ఫాంటాలను 190 రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేయడంతో పాటుగా వాటిని ఎండలో అవిశ్రాంతంగా విధులను నిర్వహిస్తున్న పోలీసులకు అందించడం ద్వారా దప్పిక తీర్చాలనుకున్నారు.ఈ తరహా పరిస్థితులలో ఆమె నిస్వార్థమైన దయ్రార్దహృదయం మిగిలిన వారికి స్ఫూర్తి కలిగించడంతో పాటుగా తమకు తోచిన రీతిలో ఇతరులకు స్ఫూర్తి కలిగించేలా ప్రోత్సహించింది.
భారతదేశంలో సుప్రసిద్ధ ఎఫ్ఎంసీజీ సంస్థలలో ఒకటైన హిందుస్తాన్ కోకా-కోలా బేవరేజస్ (హెచ్సీసీబీ), ఈ సంఘటనను తెలుసుకుని ఆమె మానవత్వపు చర్యలకు ప్రత్యేకంగా ప్రశంసించాలని నిర్ణయించుకుంది. హిందుస్తాన్ కోకా-ఓలా బేవరేజస్ (హెచ్సీసీబీ) సీఈవో క్రిస్టీనా రుజిరో, లోకమణి అమ్మ చేసిన నిస్వార్థమైన చర్యను పొడుగుతూ వ్యక్తిగతంగా లేఖరాయడంతో పాటుగా ఆమెకు వందనం సమర్పించారు. లోకమణి అమ్మకు ప్రశంసాపత్రం అందజేయడం ద్వారా హెచ్సీసీబీ సత్కరించడంతో పాటుగా కంపెనీ మర్చండైజ్ను బహమతిగా అందజేసింది.