ఖమ్మం: దేశ చరిత్రలో నేటి వరకు సాధించుకున్న హక్కులన్ని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నవే తప్ప పాలకవర్గాలు ప్రేమ ఇచ్చినవి లేవని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.సాయిబాబు అన్నారు.
స్థానిక ఖమ్మం త్రీటౌన్ కమిటి కార్యాలయం వద్ద గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సభ, కార్మిక డిమాండ్స్ తో భారీ మానవహరం నిర్వహించారు. అనంతరం సాయిబాబు మాట్లాడుతూ గతంలోనే మాంద్యం అంచుల్లోకి చేరిన భారత ఆర్థిక వ్యవస్థ కరోనా నేపథ్యంలో కోటాను కోట్ల ప్రజలు ఉపాధిని కోల్పోయారని పేర్కొన్నారు. ఉత్పత్తి స్థంభించి, నిరుద్యోగం 29శాతంకి చేరిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్లలో 19లక్షల కోట్లు బడా బాబుల ప్యాకేజికేనని అన్నారు. కరోనా భారాలు కార్మిక వర్గం పని గంటల పెంపు, చట్టాల కుదింపు, సంక్షేమ కార్యక్రమాలు కుదింపు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకం వంటి చర్యలు చేపడుతున్న మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక చర్యలు చేపడుతుందని విమర్శించారు. జిడిపి లో 70శాతం వాటా పొందుతున్న ఒక్క శాతం కార్పోరేట్ల పై ఈ భారాలు మోపడమే పరిష్కారం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి పాశం సత్యనారాయణ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర రావు, రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు తుశాకుల లింగయ్య, త్రీటౌన్ కన్వీనర్ యర్రా గోపి, నాయకులు భూక్య శ్రీ నివాసరావు , మద్ది సత్యం, మండల వీరస్వామి, మద్ది శ్రీను, మల్లారెడ్డి, మట్టిపల్లి వెంకన్న, శ్రీ శైలం, కృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 30,2020 05:53PM