బెంగళూరు: కర్ణాటకలో వరుసగా రెండో రోజు కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడ్డా హుబ్లీలో మాత్రం కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే, బలమైన ఈదురు గాలుల కారణంగా హుబ్లీ నగరంలోని పలుచోట్ల చెట్లు నేల కూలాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. రోడ్లపై విరిగిపడ్డ చెట్లు, చెట్ల కొమ్మలను తొలగించారు.
Mon Jan 19, 2015 06:51 pm