గాంధీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం రోజు కరోనా వల్ల 27 మృతి చెందగా.. మొత్తంగా 1007 మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. శనివారం సాయంత్రానికి గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా 412 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11881 కరోనా కేసులు నమోదైనట్లు గుజరాత్ సర్కారు పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm