చెన్నై: ప్రయాణికులకు కరోనా వైరస్ సోకకుండా ఉండేలా తమిళనాడులోని మెట్రో రైల్వేస్టేషన్లలో కాలితో ఆపరేట్ చేసే లిఫ్టులు ఏర్పాటు చేశారు. చెన్నై విమానాశ్రయం-వాషర్మెన్పేట, సెయింట్ థామస్ మౌంట్-సెంట్రల్ మధ్య మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. కర్ఫ్యూ కారణంగా ఈ రైలు సేవలు నిలిచిపోయాయి. రైళ్లు ప్రారంభమైన సమయంలో కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రైల్వేస్టేషన్లలో లిఫ్ట్లను ప్రయాణికులు చేతులతో తాకకుండా కాళ్లతో ఆపరేట్ చేసేలా బటన్లను మార్చి ఏర్పాటు చేశారు. కోయంబేడు మెట్రో రైల్వేస్టేషన్ ప్రధాన కార్యాలయ భవనంలో ఉన్న లిఫ్ట్ను కాలితో ఆపరేట్ చేసేలా రూపొందించినట్టు, దీని పనితీరును పరిశీలించాక అన్ని స్టేషన్లలో ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm