హైదరాబాద్ : కరోనా మహమ్మారి ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్ దయారామార్కెట్లో వస్త్రాల దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి(60)ని బలితీసుకుంది. ఆయనకు పదిరోజుల క్రితం జ్వరం రావడంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోగా, మూడు రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. అతనికి గాంధీలో చికిత్స అందించారు. దీంతో అతని ప్రైమరీ కాంటాక్ట్ సభ్యులైన భార్య, ఇద్దరు కుమార్తెలకు పరీక్షలు నిర్వహించారు. భార్య, చిన్న కూతురికి పాజటివ్ వచ్చింది. వీరిద్దరిని గాంధీలో అడ్మిట్ చేశారు. పెద్ద కూతురును హోమ్ క్వారంటైన్లో పెట్టారు. ఇదిలా ఉంటే గాంధీలో చికిత్స పొందుతున్న వ్యాపారి ఆదివారం తెల్లవారుజామున ముృతి చెందాడు. అతని మృతదేహాన్ని భార్య, చిన్న కూతురుకు, పెద్దకూతురుకు, అన్నదమ్ములతో పాటు మరికొద్దిమంది బంధువులకు ఆదివారం ఉదయం గాంధీ మార్చురీ వద్ద ముషీరాబాద్ పోలీసులు చూసే అవకాశాన్ని కల్పించారు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుటుంబ సభ్యులకు పాజిటివ్రావడంతో గాంధీలో ఉన్నారు. క్వారంటైన్లోఉన్న కూతురు ఏమీ చేయలేనిస్థితిలో ఉండడంతో బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆతని అంత్యక్రియలు ఎర్రగడ్డ ఈఎస్ వద్ద గల శ్మశాన వాటికలో ఆదివారం సాయంత్రం జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించారు. వ్యాపారి మృతి దయారామార్కెట్లోని స్థానికులను తీవ్ర కలవరానికి గురిచేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 01,2020 09:57AM