హైదరాబాద్: ప్రధాని మోడీ నేతృత్వంలో ఇవాళ కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతున్నది. మరికాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానున్నది. బీజేపీ ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా మంత్రివర్గం సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెక్యూర్టీ, ఎకనామిక్ అఫైర్స్ అంశాల్లోనూ క్యాబినెట్ భేటీ జరగనున్నట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు ద్వారా తెలుస్తున్నది. ఆర్థిక వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ అంశంపై ఎకనామిక్ అఫైర్స్ కమిటీ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm