విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. స్టెరిన్ గ్యాస్ ప్రభావంతో యలమంచలి కనకరాజు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజులు చికిత్స పొందిన కనకరాజు ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంటికి వెళ్లిపోయాడు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురవడంతో కనకరాజు మృతి చెందాడు. కాగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వల్లనే మృతి చెందాడని కనకరాజు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చికిత్స అనంతం ఒక్కొక్కరిగా మృతి చెందుతుండటంతో వెంకటపురం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm