హైదరాబాద్ : వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 'తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం - పీపుల్స్ డిమాండ్స్ డే' సందర్భంగా ఆన్ లైన్ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. నేడు సాయంత్రం 4గంటలకు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆన్ లైన్ బహిరంగసభ జరగనుంది. ఈ ఆన్ లైన్ బహిరంగసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐఎంఎల్ (ఎన్ డీ) రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి కె గోవర్ధన్, ఎంసీపీఐ(యు) రాష్ట్ర నాయకులు తాండ్రకుమార్, ఎస్ యుసిఐ(సి) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మురహరి, ఆర్ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి బండా సురేందర్ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు ప్రసాద్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ ఈ సభలో పాల్గొననునున్నారు.
ఆన్ లైన్ బహిరంగసభ లైవ్ స్ట్రీమ్ లింక్ : http://live.comrades.in/
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 02,2020 08:41AM