హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్పార్క్కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓ నిరుద్యోగి అడ్డుకున్నారు. సీఎం కార్ డోర్ దగ్గరకు వెళ్లిన నిరుద్యోగి తనకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరుద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. కరోనా నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 02,2020 09:24AM