హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గట్లేదు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. తాజాగా.. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఏడుగురు జూనియర్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం పీజీ స్టూడెంట్స్ అందరికీ కరోనా టెస్టులు చేయిస్తున్నారు. అయితే పాజిటివ్ వచ్చినా.. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శశికళ మీడియాకు వెల్లడించారు. వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇద్దరు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలకు కరోనా సోకిందని.. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm