హైదరాబాద్ : అర్థరాత్రి 2.30కి ఇద్దరు వ్యక్తులు ఏటీఎంలోకి వచ్చారు. వాళ్ల ముఖాలకు మాస్కులు ఉన్నాయి. ముందుగా సీసీటీవీని టేపుతో మూసేశారు. ఆ తర్వాత చోరీ జరిగినట్లు అర్థమైంది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగింది. ఓ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మే 23న ఈ చోరీ జరిగింది. మే 20న ఏటీఎంలో డబ్బును సెట్ చేశారు. పోలీసులు కేసు రాసి దర్యాప్తు చేయగా ఓ విషయం తెలిసింది. ఏటీఎంలను చోరీ చేసేవాళ్లు జనరల్గా గ్యాస్ కట్టర్ తెచ్చి... కియోస్క్ని పగలగొడతారు. కానీ... ఈ చోరీ అలా జరగలేదు. ఏటీఎం ఏమాత్రం చెక్కు చెదరలేదు. లోపల రూ.42.39 లక్షలు మాయమయ్యాయి. ప్రత్యేకమైన చిన్న హ్యాకింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఈ చోరీ చేశారని పోలీసులు భావిస్తున్నారు. అలాంటి యంత్రం ద్వారా... మరిన్ని చోరీలు జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. డబ్బు నింపే సంస్థలో ఉద్యోగులకూ, ఈ చోరీకీ సంబంధం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి చోరీ ఎవరు చేశారో, ఎలా చేశారో మాత్రం తెలియట్లేదు. ఏటీఎంల దగ్గర చాలా బ్యాంకులు సెక్యూరిటీని పెట్టుకోవట్లేదు. అదనపు ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇలా చేస్తున్నాయి. ఐతే... ఇలాంటి ఎవరూ లేని ఏటీఎంలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm