హైదరాబాద్: లాక్డౌన్ కాలంలో నేరాలు తగ్గుముఖం పట్టడం పోలీసులకు కాస్తంత ఉపశమనాన్నిచ్చింది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా నేరాలు తగ్గిపోయాయని డీజీపీ మహేందర్రెడ్డి ప్రకటించడమే దీనికి నిదర్శనం. కానీ.. సడలింపులు మొదలవగానే పరిస్థితి మొదటికొస్తోంది. క్రమంగా నేరాలు పెరుగుతున్నాయి. పోలీసులు అప్రమత్తమయ్యేలోపే జరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో 30 గంటల వ్యవధిలోనే 5 హత్యలు జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. అంటే సరాసరిన ప్రతి 6 గంటలకో హత్య జరిగింది. ఇందులో ఇద్దరు మహిళల్ని వారి భర్తలే హత్య చేయడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm