హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదని.. తెలంగాణ సమాజం కోట్లాడితేనే రాష్ట్రం ఏర్పడిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం చెప్పుకొచ్చారు. ఇవాళ తెలంగాణ జనసమితి కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక వ్యక్తి వల్లే తెలంగాణ వచ్చిందని నమ్మించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. సమిష్టి పోరాటం చేయకుంటే తెలంగాణకు తీరని నష్టం జరుగుతోందన్నారు. తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు ఆశయాలు నెరవేరటం లేదని ఆయన ఆరోపించారు. గుప్పెడు మంది ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడ్తున్నారు
Mon Jan 19, 2015 06:51 pm