పెద్దపల్లి: రామగిరి మండలం ఓపెన్ కాస్ట్-1లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మహాలక్ష్మి ఓబీ కంపెనీలో బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. గోదావరిఖనిలోని సింగరేణి ఆసుపత్రికి అధికారులు మృతదేహాలను తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm