హైదరాబాద్: సెలూన్లు, బ్యూటీ పార్లర్లూ, స్పా లకు తమిళనాడు ప్రభుత్వం కొత్తమార్గదర్శకాలు విడుదల చేసింది. సెలూన్లు, బ్యూటీ పార్లర్లూ, స్పా లలో తప్పనిసరిగా ఓ రిజిస్టర్ ఉంచుకోవాలి. అందులో కస్టమర్ల వివరాలన్నీ రాయాలి. ముఖ్యంగా ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇదే కాదు... ఇటువంటి నింబంధనలతో తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
నింబంధనలు
- సోషల్ డిస్టాన్స్ తప్పనిసరి.
- సీట్లలో 50 శాతం మాత్రమే నింపుకోవచ్చు. సీట్ల మధ్య ఖాళీ ఉండాలి,
- ఒక కస్టమర్కి వాడిన బ్లేడ్, మరో కస్టమర్కి వాడకూడదు.
- వాడిన బ్లేడును జాగ్రత్తగా పారేయాలి. తొలగించిన జుట్టు, ఫేస్ ప్యాక్ లను కూడా జాగ్రత్తగా పారేయాలి.
- డిస్పోజబుల్ టవల్స్ మాత్రమే వాడాలి. ఒక కస్టమర్కి వాడిన టవల్ మరొకరికి వాడాలంటే.. దాన్ని ఉతికిన తర్వాతే వాడాలి.- ఏ పరికరాలు వాడినా... వాటిని ముందుగా శానిటైజర్తో శుభ్రం చేసిన తర్వాతే వాడాలి.
- ఏసీ ఆన్ చెయ్యకూడదు. కిటీకీలన్నీ తెరచి ఉంచాలి. లోపలికి గాలి వచ్చేలా చెయ్యాలి.
- చైర్లు, టేబుళ్లు, డోర్లు, అద్దాలు అన్నీ... లైజోల్ లేదా హైపోక్లోరైట్ కలిపిన మిశ్రమంతో రోజుకు ఐదుసార్లు శానిటైజ్ చెయ్యాలి.
- పనిచేసేవారికి పేపర్ నాప్కిన్లు ఇవ్వాలి. వాళ్లకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
- పని మొదలుపెట్టేటప్పుడు, పని పూర్తయ్యాక... చేతులకు శానిటైజర్ రాసుకోవాలి. మాస్క్ ధరించాలి, గ్లోవ్స్ ధరించాలి.
- పనిచేసేవారు తమ ముక్కు, నోరు, కళ్లను ముట్టుకోకూడదు.
ఇవి ప్రస్తుతం తమిళనాడుకే పరిమితమైనా... ముంబైలో ఎవరి టవల్ వారే తెచ్చుతోవాలనే ఓ కండీషన్ పెట్టారు. అన్ని రాష్ట్రాలూ దాదాపు ఇలాంటి రూల్స్ పెడుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 02,2020 02:27PM