అహ్మదాబాద్: గుజరాత్ కెమికల్ కంపెనీలో సంభవించిన పేలుడు ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 57 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ పేలుడు అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో తీవ్ర నష్టం జరిగిందని భరూచ్ జిల్లా కలెక్టర్ ఎండీ మోడియా తెలిపారు. అకస్మాత్తుగా పేలుడు సంభవించి మంటలు చెలరేగడంతో కార్మికులు తప్పించుకునేందుకు అవకాశం దొరకలేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm