ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను మహారాష్ట్ర సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకు మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం రోజు కరోనా వల్ల 122 మంది మృతి చెందగా, మొత్తం 2,587 మంది కరోనాతో మృతి చెందినట్లు మహారాష్ట్ర వైద్య శాఖ తెలిపింది. కొత్తగా 2560 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 74, 860 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనా నుంచి 996 మంది కోలుకొని డిశ్చార్జ్ అవగా.. మొత్తం 32,329 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 39, 935 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm