అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం భరూచ్ జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై దర్యాప్తు జరిపించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం జరిగిన పేలుడుతో చెలరేగిన మంటలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయని భరూచ్ జిల్లా కలెక్టర్ మోడీయా తెలిపారు. మధ్యాహ్నం మంటలు చెలరేగిన వెంటనే కెమికల్ కంపెనీ సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన 4800 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. మండే స్వభావం ఎక్కువగా ఉన్న కెమికల్స్ను కంపెనీలో నిలువ ఉంచడం వల్లే పేలుడు జరిగినట్లు ఇప్పటివరకు లభించిన ఆధారాలను బట్టి తెలుస్తున్నదని మోడియా పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm