ఆదిలాబాద్ : ముంబై నుంచి రాష్ర్టానికి వచ్చిన వలస కూలీల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండల కేంద్రం శాంతినగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఇటీవలే 22 మంది వలస కూలీలు ముంబై నుంచి ఉట్నూర్కు చేరుకున్నారు. ముంబైలో కరోనా ఉధృతి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైద్యులు ఈ వలస కూలీల శాంపిల్స్ను సేకరించి కరోనా పరీక్షల నిమిత్తం పంపించారు. మొదటగా ఆరుగురి శాంపిల్స్కు పరీక్షలు నిర్వహించగా కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఏజెన్సీ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ కుడిమెత మనోహర్ తెలిపారు. దీంతో వీరిని హుటాహుటిన ఉట్నూర్ నుండి అంబులెన్స్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm