హైదరాబాద్ : కరోనా దేశవ్యాప్తంగా ప్రజలకు కునుకులేకుండా చేస్తోంది. వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా కారణంగా దేశంలో మార్చి 23 నుండి దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా డీఎంకే ఎంపీ ఎ.రాజాను క్వారంటైన్లో ఉంచినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. లాక్డౌన్ ప్రారంభం కాక ముందు జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఎంపీ రాజా ఢిల్లీకి వెళ్లారు. అనంతరం లాక్డౌన్ కారణంగా విమానాలు, రైళ్లు రద్దవడంతో ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. లాక్ డౌన్ 4.0లో సడలింపుల అనంతరం ఆయన విమానంలో ఢిల్లీ నుంచి కోయంబత్తూర్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో వైద్యపరిశోధన అనంతరం ఎంపీ.. నీలగిరి జిల్లా ఊటీ హిల్బంక్ ప్రాంతంలో తన ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ అధికారులు ఎంపీ ఇంటికి వెళ్లి థర్మల్ స్కానర్తో పరీక్షలు నిర్వహించి, ఏడు రోజులు క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఈ మేరకు ఎంపీ ఇంటికి అధికారులు స్టిక్కర్ను అంటించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 04,2020 09:55AM