హైదరాబాద్ : భారత్లో కరోనా రోజురోజుకూ విశ్వరూపం చూపిస్తోంది. గత 15 రోజులుగా వరుసగా భారీ సంఖ్యలో కేసులు పెరుగుతూ ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటలలో అత్యధికంగా 9,304 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక, కరోనాపై పోరాటంలో ఒకేరోజు 260 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,919కు చేరుకోగా మరణించినవారి సంఖ్య 6,075కు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,06,737 యాక్టివ్ కేసులు ఉండగా కరోనాబారిన పడి కోలుకుని ఇప్పటి వరకు దేశంలోని వివిధ ఆస్పత్రుల నుంచి 1,04,107 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసుల పరంగా ప్రపంచ వ్యాప్తంగా భారత్ 6 స్థానానికి చేరువలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితులు దారుణంగా ఉండనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm