హైదరాబాద్ : దేశంలో లాక్ డౌన్ 4.0 సడలింపుల అనంతరం కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఢిల్లీలో ఓ రైల్వే అధికారికి కరోనా సోకింది. రైల్వే అధికారితోపాటు అతని భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో వారిని ఆసుపత్రిలో క్వారంటైన్ చేశారు. దీంతో రైల్వే కార్యాలయం అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన రైల్వే అధికారి ఈ నెల 1వతేదీన రైల్వే కార్యాలయంలో విధులకు హాజరయ్యారని తేలింది. దీంతో రైల్వే కార్యాలయాన్ని శానిటైజ్ చేయించి, ఆ కార్యాలయంలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులను ముందుజాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్ చేశారు. ఢిల్లీతోపాటు దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm