హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసులో ఎన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో డ్రగ్స్ తీసుకున్న 300 మందిపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. లాక్డౌన్ సడలింపుతో మళ్లీ వారంతా డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా అనుమానిస్తున్నారు. 300 మందిలో సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, విద్యార్థుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రముఖులు బెంగుళూరు సైతం వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. అలాగే గతంలో డ్రగ్స్ విక్రయాలు నిర్వహించిన వారి కదలికలపై కూడా అధికారులు నిఘా ఉంచారు. అమిత్, పరమ అరెస్ట్లతో ప్రముఖుల చిట్టా బయటపడింది. 15 రోజులుగా హైదరాబాద్లో డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు పెరిగినట్లుగా గుర్తించారు. దీంతో డ్రగ్స్ తీసుకుంటున్న వారి జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అమిత్, పరమలిద్దరూ వాట్సాప్ చాటింగ్తో పాటు కాల్డాటాను డిలీట్ చేసేశారు. దీంతో వాట్సాప్ చాటింగ్ను రీట్రైవ్ చేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పోలీస్ అధికారుల సాయాన్ని ఎక్సైజ్ అధికారులు తీసుకుంటున్నారు. వాట్సాప్ చాటింగ్ బయటకు వస్తే మరికొంతమంది ప్రముఖుల బండారం బయటపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm