గాంధీనగర్: గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల వేళ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా చేయడం కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ. కర్జాన్ ఎమ్మెల్యే అక్షయ్ పటేల్, కప్రాద ఎమ్మెల్యే జితూ చౌదరి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి అప్పగించారు. వీరి రాజీనామాలను ఆయన వెంటనే ఆమోదించారు. అంతకు ముందు మార్చి నెలలో ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 103 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్కు 66 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ నెల 19న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm