హైదరాబాద్ : దక్షిణ చైనాలోని ఓ స్కూల్లో ఘోరాతి ఘోరం చోటుచేసుకుంది. 40 మంది విద్యార్థులను ఓ సెక్యూర్టీ గార్డు కత్తితో పొడిచాడు. విద్యార్థులతో పాటు టీచర్లపై కూడా అతను దాడి చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గాంగ్జీ ప్రావిన్సులోని సుజౌ నగరంలోని ఓ స్కూల్లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు.గాయపడినవారిని వివిధ హాస్పిటల్స్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. నిందితుడిని 50 ఏళ్ల సెక్యూర్టీ గార్డు లి జియామిన్ గా గుర్తించారు. స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు ఇతర సెక్యూర్టీ గార్డులు కూడా ఈ దాడిలో గాయపడ్డారు. గాయపడివారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm