హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి అధ్వర్యంలో మంజీరా డ్యాం పరిశీలనకు కాంగ్రెస్ నాయకుల బృందం బయలుదేరింది. అనంతరం పోలీసులు వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. గోదావరి నీటితో సింగూర్, మంజీరా డ్యాంను నింపుతామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. సొంత జిల్లా ప్రజలనే కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. జలదీక్ష పేరుతో ప్రాజక్టుల పరిశీలనకు వెళుతున్న తమను అడ్డుకోవడం న్యాయంకాదన్నారు. తెలంగాణ పోలీసులు కేసీఆర్ సర్కారుకు అనుకూలంగా మారవద్దని కోరారు. ఆంధోల్, నారాయణ్ ఖేడ్, నార్సాపూర్, మెదక్, జహీరాబాద్, ఇతర నియోజకవర్గాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయని తెలిపారు. సింగూర్ ప్రాజెక్టులో నీరు కనిష్ట స్థాయికి చేరుకుందని ఆరోపించారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికి ప్రజలకు తాగేందుకు మంచి నీరు కూడా అందుబాటులో లేదని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేవలం మాటల కోతలతోనే కాలం గడుపుతున్నారని ఎద్దేవ చేసారు. ప్రాజెక్టుల పేరిట ప్రజ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 04,2020 04:16PM