హైదరాబాద్ : వరంగల్ జిల్లా గొర్రెకుంటలోని బావిలో 9 మంది శవాలై తేలి సంచలనం సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడు బిహార్కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ను గీసుకొండ పోలీసులు హన్మకొండ కోర్టులో ఇవాళ హాజరుపరిచారు. గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాం వద్ద బావిలో శవాలై తేలిన 9 మందిని హతమార్చింది సంజయ్ కుమార్ యాదవ్ అని పోలీసుల విచారణలో తేలిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా న్యాయస్థానం నిందితుడు సంజయ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం సంజయ్ను పోలీసులు వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm