హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ను వైరస్ వణికిస్తోంది. ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో కరోనా సోకిన వ్యక్తి కనిపించకుండాపోయిన ఘటన నగరంలో కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో నివాసించే 60 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యం కారణంగా మే 30న ఏరియా ఆస్పత్రికి వెళ్లాడు. దగ్గు, దమ్ము, ఆస్తమా, ఉన్నట్లు గుర్తించిన వైద్యులు..అతడిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో గాంధీలో అతడికి కరోనా టెస్టులు చేయగా..వైరస్ పాజిటివ్గా తేలింది. ఈ మేరకు బుధవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ దృవీకరించింది. వృద్ధుడి గురించి వైద్య శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో వైద్యులు, పోలీసులు కాలనిలో సర్వే చేపట్టారు. బాధితుడికి చెందిన ప్రైమరీ కాంటాక్టులపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే బాధితుడు హైదరాబాద్లో కనిపించకపోవడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అతడి కోసం వెతుకులాట ప్రారంభించారు. అటు వైరస్ బాధితునికి సంబంధించిన 13 మంది కుటుంబ సభ్యులను అధికారులు హోంక్వారంటైన్లో ఉంచారు.
Mon Jan 19, 2015 06:51 pm