డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కొత్తగా 60 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోజు నలుగురు బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1145కు చేరిందని, వీరిలో 286 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 845 మంది ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా రాష్ట్రలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
Mon Jan 19, 2015 06:51 pm