శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో పోలీస్ పార్టీ లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో పోలీసులలో ఎవరికీ హాని జరుగకపోయినప్పటికీ ఒక పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు కుల్గాం ఆస్పత్రికి తరలించారు. గురువారం సాయంత్రం దక్షిణ కశ్మీర్లోని కుల్గాం ఏరియాలోగల యారిపొర మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు దాగి ఉన్న చోటును కనిపెట్టేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
Mon Jan 19, 2015 06:51 pm