హైదరాబాద్: తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావంతో ఈ రోజు 12 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 27,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 220 మంది బాధితులు మృతిచెందారు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన వారిలో 12,132 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, 14,901 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నది. 74,860 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 23645 కేసులతో ఢిల్లీ, 18100 పాజిటివ్ కేసులతో గుజరాత్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm