నల్లగొండ : మాడ్గులపల్లిలో నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై బైకును లారీ ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలివి.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన దోరేపల్లి పవన్(30) ఉదయం నకిరేకల్ మండల చందుపట్ల గ్రామంలోని బంధువుల ఇంటికి బైక్పై వెళ్లాడు. సాయంత్రం తిరుగుప్రయాణంలో తన బావమరిది నాగరాజుతో కలిసి వస్తుండగా మాడ్గులపల్లి మండల కేంద్రంలోని మసీదు వద్ద వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టింది. బైకు నడుపుతున్న పవన్కు తీవ్రగాయాలు కాగా నాగరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పవన్ను 108 వాహన సిబ్బంది చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm