సిద్దిపేట : జిల్లాలోని మర్కుక్ మండలం శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడింది. దీంతో వెంకటాపురం గ్రామంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. పలువురి ఇళ్లల్లోకి నీళ్లు ప్రవేశించాయి. జగదేవ్పూర్, ఆలేరు నియోజకవర్గాల్లోని ఎం తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులు నింపేందుకు కొండపోచమ్మ సాగర్ నీటిని విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్కు మూడు కి.మీ. దూరంలో కాలువకు గండి పడింది.
Mon Jan 19, 2015 06:51 pm