హైదరాబాద్ : కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వారిలో యాంటీబాడీలు త్వరగా క్షీణిస్తున్నట్టు చైనాకు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత లక్షణాలు లేని వారిని పరీక్షించగా ఈ విషయం బయటపడింది. లక్షణాలు లేని దాదాపు 40 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య దారుణంగా పడిపోయిందని అధ్యయనకారులు తెలిపారు. అదే సమయంలో వైరస్ లక్షణాలున్న 13 శాతం మందిలోనే యాంటీబాడీల సంఖ్య క్షీణించినట్టు పేర్కొన్నారు. అంతేకాదు, ఒకసారి కోవిడ్ బారినపడి కోలుకున్న వారికి తిరిగి వైరస్ సోకదనే భావన తప్పన్న విషయం అధ్యయన ఫలితాల్లో స్పష్టమైంది. మరోవైపు, వైరస్ లక్షణాలు లేని వారిలో వాపు ప్రక్రియ నివారకాలుగా ఉపయోగపడే కణ సంకేత ప్రొటీన్ల సంఖ్య తక్కువగా ఉన్నట్టు అధ్యయనకారులు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm