హైదరాబాద్ : కరోనా వైరస్తో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్న తరుణంలో చైనా పరిశోధకులు మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో మహమ్మారిని తలపించే విధంగా ఉన్న ఓ కొత్త రకమైన స్వైన్ ఫ్లూను వారు కనుగొన్నారు. జీ4 అని పిలువబడే ఈ వైరస్ జన్యుపరంగా న1చీ1 జాతి నుండి వచ్చిందని వారు అంటున్నారు. ఈ వైరస్ మానవులకు సోకడానికి అత్యంత అనుకూలంగా ఉండాల్సిన, అవసరమైన లక్షణాలు ఉన్నాయని చైనీస్ వర్సిటీలు, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2011 నుండి 2018 వరకు పరిశోధకులు 10 చైనా ప్రావిన్సులు, పశువైద్య ఆసుపత్రిలోని పందుల కళేబరాల నుంచి 30,000 నాజల్ శ్వాబ్స్ను తీసుకుని 179 స్వైన్ ఫ్లూ వైరస్లను ఐసోలేట్ చేశారు. వాటిల్లో ఎక్కువ సంఖ్య కొత్త రకం వైరస్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇవన్నీ కూడా మనుషులకు సోకే ఛాన్స్ ఎక్కువగా ఉందని.. వాటిపై విస్తృతంగా పరిశోధనలు జరపాల్సి ఉందని అంటున్నారు. జీ4 ప్రమాదకరమైన అంటువ్యాధి అని చైనీస్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ మూడు ప్రత్యేకమైన జాతుల సమ్మేళనం అని అన్నారు. ఒకటి యూరోపియన్, ఆసియా పక్షులలో కనిపించే జాతుల మాదిరిగా ఉంటుందని, రెండోది 2009 మహమ్మారికి కారణమైన న1చీ1 జాతి అని, మూడోది ఏవియన్, హ్యూమన్, పిగ్ ఇన్ఫ్లూఎంజా వైరస్ల జన్యువులతో కలిగి ఉన్న ఉత్తర అమెరికా న1చీ1 అని తెలిపారు. దీనికి విరుగుడు లేదని.. ఒకవేళ మనుషులకు సంక్రమిస్తే మిగతా ఫ్లూ వైరస్ల మాదిరిగా తగ్గదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందని.. కానీ మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తుందన్న దానికి ఆధారాలు లేవన్నారు. దాని కోసమే విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఫెర్రెట్స్తో సహా వివిధ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు ఫ్లూ సమయంలో మనుషులు అనుభవించే జ్వరం, దగ్గు, తుమ్ములు మాదిరి లక్షణాలే ఉన్నట్లు గమనించారు.
Mon Jan 19, 2015 06:51 pm