హైదరాబాద్: భారత్లో ఇవాళ అత్యధికంగా కరోనా వైరస్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 18522 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒక్క రోజులోనే దేశంలో 418 మంది వైరస్ బారినపడి మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 5,668,40గా ఉన్నది. దీంట్లో 2,15,125 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 3,34,822 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 16,893గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
Mon Jan 19, 2015 06:51 pm