అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను పొడిగిస్తూ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ వెల్లడించారు. అయితే ఈ ఆదేశాలు కేవలం ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్నవారికి మాత్రమే వర్తిస్తాయని ఆయన అన్నారు. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ కరోనా వైరస్ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఆగష్టు 1న ''ప్రథమ్'' అనే సరికొత్త అప్లికేషన్ను లాంచ్ చేయనుంది. పల్లెవెలుగు బస్సు సర్వీసుల నుంచి సూపర్ లగ్జరీ సర్వీసుల వరకు అన్నింటికీ కూడా ప్రయాణీకులకు ఈ యాప్ నుంచే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm