హైదరాబాద్: బోనాలకు ప్రతీక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు భాగ్యనగరం భక్తులు. కానీ కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా ఈ ఏడాది మహంకాళి ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదు. కేవలం ఆలయ పూజారులు, సిబ్బంది మాత్రమే అమ్మవారికి బోనం సమర్పించి, పూజలు నిర్వహిస్తారు. జులై 10 నుంచి 13వ తేదీ వరకు భక్తులను అనుమతించమని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సారి ఇండ్లలోనే బోనం సమర్పించుకోవాలని భక్తులకు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm