చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకే పెరిగిపోతున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా కొత్తగా 4,329 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటి 1,02,721కి చేరింది. ఇక కరోనా మరణాలు కూడా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా 64 మంది కరోనా బాధితులు మృతిచెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,385కు చేరింది. తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm