న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ సబ్ ఇన్ స్పెక్టర్(ఎస్ఐ) కరోనాతో శుక్రవారం చనిపోయాడు. దీంతో మిగతా పోలీసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎస్ఐ ధరంవీర్ సింగ్ బైపాస్ సర్జరీ కోసం.. నోయిడాలోని కైలాష్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జున్ 13న చేరాడు. అప్పుడు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితం వచ్చింది. జూన్ 22న ఎస్ఐకి బైపాస్ సర్జరీ చికిత్స ముగిసింది. ఆ తర్వాత ధరంవీర్ ఐసీయూ వార్డులోకి వెళ్లారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కంటే ముందు.. ఎస్ఐకి కరోనా పరీక్షలు మరోమారు నిర్వహించారు. ఈ ఫలితాల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. శుక్రవారం ఉదయమే ఎస్ఐ ధరంవీర్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm