ఇస్లామాబాద్: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీకి శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలింది. జ్వరం విపరీతంగా రావడంతో సిబ్బంది ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆయన హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఆయన ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘‘నాకు మధ్యాహ్నం నుంచి తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయా. కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దేవుడి దయతో బలంగా, పూర్తి శక్తితోనే ఉన్నా. ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నా.’’ అంటూ ఖురేషీ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm