విశాఖపట్నం: జిల్లాలోని రేవుపోలవరం సముద్రంలో పూజిత్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పాయకరావు పేటకు చెందిన పూజిత్.. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చాడు. ఈ క్రమంలో పూజిత్ సముద్రంలో గల్లంతయ్యాడు. పూజిత్ కోసం అతని స్నేహితులు గాలించగా ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో పూజిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూజిత్ యలమంచిలి బజాజ్ షోరూమ్లో మార్కెటింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm