న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి కోలుకున్న 47 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది రక్త స్లాస్మాను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కరోనా బారిన పడి బాధపడుతున్న రోగులకు ప్లాస్మాను దానం చేస్తామని కోవిడ్-19 నుంచి కోలుకున్న 47 సిబ్బంది చెప్పారని సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. ఢిల్లీ, ముంబైలో కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు ప్లాస్మాను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm