హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. టీవీ నటుడు సాక్షిశివకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే టీవీ నటులు ప్రభాకర్, హరికృష్ణ, నవ్యకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరగడంతో టీవీ నటుల్లో ఆందోళన మొదలైంది.
Mon Jan 19, 2015 06:51 pm