ముంబై: కరోనా వైరస్ మహమ్మారి మహారాష్ర్టను గజగజ వణికిస్తోంది. ఆ రాష్ర్టంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు కూడా అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 6,364 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 198 మరణాలు సంభవించాయి. మహారాష్ర్టలో ఇప్పటి వరకు 1,92,990 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,376 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm