అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు పోలీసులు. కొద్ది సేపటి క్రితం విశాఖ వైపు వెలుతున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో రవీంద్రను అరెస్టు చేశారు. తుని మండలం సీతారాంపురంలో జాతీయ రహదారిపై కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం ఆయనను తుని నుంచి విజయవాడకు పోలీసులు తరలిస్తున్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm